ఏలూరు: నూజివీడు పట్టణంలో జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. అనంతరం మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్బంగా 286 స్వయం సహాయక సంఘాలకు గాను సుమారు రూ.36 కోట్ల చెక్కును ఆయన అందజేశారు.