బాపట్ల జిల్లా చందోలు గ్రామంలోని ఎస్టీ కాలనీలో శనివారం రాత్రి పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చందోలు ఎస్ఐ తన సిబ్బందితో కలిసి కాలనీలో బస చేసి, స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామంలో శాంతిభద్రతలు, రాత్రి గస్తీ, స్థానిక మౌలిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.