AKP: జిల్లాకు చెందిన బీజేపీ క్రియాశీలక సభ్యులతో ఎంపీ సీఎం రమేష్ బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణ, గ్రామస్థాయి బాధ్యతలు తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు.