అన్నమయ్య: గాలివీడు మండలంలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు బయటపడటంతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ వెంకటరత్నం హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో ఉపాధి పనుల్లో రూ.17.29 లక్షలు, పంచాయతీరాజ్ పనుల్లో రూ.40 వేల అక్రమాలు గుర్తించగా, ఇప్పటివరకు రూ.55 వేల వసూలు చేశామన్నారు. మిగిలిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.