NLR: రూరల్ 22వ డివిజన్ పాత వేదాయపాలెంలో TDP నేత గిరిధర్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఈ డివిజన్ అభివృద్ధికి రూ.5.03 కోట్లు కేటాయించిందని, MLA శ్రీధర్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గవ్యాప్తంగా వందల కోట్లతో పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. నీటి సమస్య పరిష్కారానికి త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.