AKP: జిల్లాలోని పాఠశాలల్లో పరిశుభ్రత, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి చెత్త లేకుండా చూడాలన్నారు. విద్యార్థులు భద్రత కోసం మొదటి అంతస్తులో నిద్రించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.