KRNL: ఆలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా వేదిక – గ్రీవెన్స్ డే కార్యక్రమంలో టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను జ్యోతి దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో ఆమె ప్రతి ఒక్కరి అర్జీని శ్రద్ధగా విని స్వీకరించారు.