ATP: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. కొత్తగా తెచ్చిన వీబీ జీ రాంజీ చట్టం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందన్నారు. శనివారం బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లి నుంచి అనంతసాగరం వరకు సీపీఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన మద్దతు ప్రకటించారు.