AKP: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం శివారు జాలరిపేటలో మంచినీటి బోరును గ్రామ సర్పంచ్ చింతకాయల సుజాత, ఎంపీటీసీ అర్జిల్లి దేవి శుక్రవారం ప్రారంభించారు. తాగునీటి ఎద్దడి నివారణ కోసం మండల పరిషత్ నిధి నుంచి మంచినీటి బోరు వేయించినట్లు పేర్కొన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీటిని పొదుపుగా వాడాలని సూచించారు.