KDP: రాజుపాలెం మండలం పర్లపాడులో ఈనెల 10న జరిగిన మహేశ్ హత్య కేసులో ఇవాళ ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు ASP విభుకృష్ణ తెలిపారు. ఆయన సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. భంగి సురేశ్, చరణ్, దేవమ్మను అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు తెలిపారు. చిన్న చిన్న విషయాలకే గొడవ పడి హత్య వరకు వెళ్లవద్దని సూచించారు.