ATP:పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామ రైతు చాకలి బాలరాజుకు చెందిన చీనీ తోట మంటల్లో కాలి పోయింది. బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు తోట సమీపంలోని ఎండు గడ్డికి నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి తోటను చుట్టుముట్టాయి. దీంతో మూడేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న వంద చీనీ చెట్లు, డ్రిప్పు పరికరాలు కాలిపోయాయి. దాదాపు రూ.2 లక్షల మేర నష్టం వాటిలిందన్నారు.