VZM: చీపురుపల్లి ఆంజనేయపురంకి చెందిన గుడ్ల శ్యామసుందర్ (70) ఆస్తమా వలన ఆదివారం మరణించారు. అయన భార్య గుడ్ల రమణమ్మ, కుమార్తెలకి మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గోవిందరాజులు నేత్రదానంపై అవగాహన పరిచారు. వారు నేత్రదానం చేయడానికి అంగీకరించడంతో టెక్నీషియన్ వచ్చి ఆయన కార్నియాను సేకరించి విశాఖపట్నం హాస్పిటల్కి తరలించారు.