CTR: రేణిగుంట పట్టణంలోకి వచ్చే ప్రధాన మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జిని ఈనెల 13వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టూ వీలర్లు, త్రీ వీలర్లు సంత గేటు మార్గంలో, ఫోర్ వీలర్లు, భారీ వాహనాలు నారాయణాద్రి ఆసుపత్రి మీదుగా వెళ్లాలని సూచించారు.