అన్నమయ్య: మదనపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కలెక్టర్ నిశాంత్, ఎమ్మెల్యే షాజహాన్ తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచనలు సమాజంలోని ప్రతి వర్గానికి మార్గదర్శకమని కలెక్టర్ పేర్కొన్నారు. పీఎం అజయ్ పథకం కింద 25 మంది లబ్ధిదారులకు రూ.27 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.