CTR: వీ.కోట మండలంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గోనమాకులపల్లి, కృష్ణాపురం పంచాయతీల్లో సుమారు రూ.2 కోట్ల అభివృద్ధి పనులను, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లో సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, కమ్యూనిటీ హాల్ వంటి సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, పరిష్కారం కోసం అధికారులను ఆదేశించారు.