కోనసీమ: ఆత్రేయపురం వాడపల్లి దేవస్థానంలో గురువారం జరిగే చక్రస్నాన కార్యక్రమ ఏర్పాట్లను డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వేడుకలు సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.