AKP: కసింకోట మండలం తాళ్లపాలెం, సుందరయ్యపేటలో బుధవారం సాయంత్రం మన ఊరు మన జెండా కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొని పార్టీ జెండాను ఎగరవేశారు. తాళ్లపాలెం నర్సీపట్నం రహదారిని ఆరు లైన్లతో విస్తరించినట్లు తెలిపారు. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపడతామన్నారు. ప్రతి ఇంటి పైన కాషాయం జెండా ఎగరాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర రావు పాల్గొన్నారు.