SKLM: ప్రముఖ గాయని ఆశాభోంస్లే మృతిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం సంతాపం ప్రకటించారు. ప్రముఖ గాయని ఆశాభోంస్లే మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో శ్రోతలకు ఆనందాన్ని పంచి, ఎన్ని తరాలు అయినా ప్రజలతో బంధాన్ని కొనసాగిస్తూ ఉంటుందన్నారు. ఆశాభోంస్లే కుటుంబ సభ్యులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.