కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి కాకినాడ సిద్ధార్థ నగర్ వాస్తవ్యులు సానబోయిన నాగ రమేష్ కుటుంబ సభ్యులు రూ. 1,01,116 విరాళాన్ని సోమవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు.