KRNL: కౌతాళంలో రాజీనామాల పర్వం ఆగడం లేదు. కుంబలనూరు, దోమలదిన్నె సర్పంచులు వీరేశ్, మమత TDP సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉరుకుంద శ్రీ లక్ష్మీనరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. కష్టపడ్డ నాయకులకు నియోజకవర్గంలో సముచిత స్థానం లభించడం లేదన్నారు.