ATP: బుక్కరాయసముద్రంలోని వేంకటేశ్వర ఫుడ్స్ కంపెనీపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. అనంతపురానికి చెందిన రేవంత్ గుప్తా, శశి 15 ఏళ్లుగా ‘రామ్’ పేరుతో పొద్దుతిరుగుడు విత్తనాల వ్యాపారం చేస్తున్నారు. సదరు కంపెనీ యజమాని వెంకటకిశోర్ అదే పేరుతో నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.