SS: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ వినూత్న శ్రీకారం చుట్టారు. చోరీల నియంత్రణకు పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో వారికి సిబ్బంది కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.