AKP: పరవాడలో ఈఎస్ఐ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇవాళ పరవాడలో పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి 1.43 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి ఏడాది కావస్తున్న నిర్మాణ పనులు చేపట్టలేదని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి అన్నారు.