AKP: దేవరాపల్లి మండలంలో ఉపాధి హామీ పనుల అమలును అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రైవాడ, గరిసింగి, దేవరాపల్లి పంచాయతీల్లో జరుగుతున్న పనులను ఏపీఓ రుక్మిణీదేవి, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణరావు పరిశీలించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వలసలు తగ్గించుకోవాలని కూలీలకు సూచించారు.