KKD: పిఠాపురం మండలంలో పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. మండలం వ్యవసాయ అధికారి గంగాధర్ మాట్లాడుతూ వరిలో దోమపోటు కనిపిస్తుందన్నారు. ఈ సుడిదోమా కాండం నుంచి రసం పీల్చడం ద్వారా నష్టం కలిగిస్తుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో తూటికాడ కషాయం పిచికారి చేస్తే తక్కువ ఖర్చుతో బాగా పని చేస్తుందని రైతులకు తెలిపారు.