NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా చిట్యాల మండలం, బొంగోనిచెరువులో వీధులు, మురికి కాలువలను ఇవాళ శుభ్రం చేశారు. సర్పంచ్ కట్ట ఆశయ్య, ఉపసర్పంచ్ సామిడి సాయికృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యదర్శి లింగస్వామి, మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పుష్ప, యాదిరెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.