AP: కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా జిల్లాకు 350 ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. మంగళం 1, 2 డిపోలుగా విభజించి 50 చొప్పున బస్సుల నిర్వహణ బాధ్యతలను వేర్వేరు ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. తొలి విడతగా 4 నెలల్లో 50 ఈకా ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వీటికి పినాకిల్ ఈ-మొబిలిటీ సంస్థ ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది.