AKP: నియోజకవర్గ స్థాయిలో ఈనెల 13న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు పంపిణీ కార్యక్రమం కోటవురట్లలో జరగనుంది. హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు స్థానిక వ్యవసాయ అధికారి కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఏవో సరోజిని పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం నిధులు రూ.2,000, అన్నదాత సుఖీభవ పథకం నిధులు రూ.4,000 అర్హులైన రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు.