WNP: టీచర్స్ కాలనీకి చెందిన జ్యోతికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. మదనాపురం అంబులెన్స్ అక్కడికి చేరుకుని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈఎంటీ జ్యోతి, పైలెట్ నయీం సమయస్ఫూర్తితో ప్రసవం చేయగా తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.