AP: YCP హయాంలో అమరావతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యమానికి కౌంటర్ క్యాంపులు వేయించారని, పవన్ వెళ్తే ముప్పకంప వేసి అడ్డుకున్నారని పేర్కొన్నారు. దేశమంతా అమరావతికి మద్దతిచ్చి సంఘీభావం తెలిపితే.. వాళ్లను తప్పుబడతారా? అని ప్రశ్నించారు. మళ్లీ ప్లాన్-B అంటూ నాటకం ఆడుతున్నారని.. ఇలాంటి మనస్తత్వం, ప్రవర్తనను ఎక్కడా చూడలేదని విమర్శించారు.