SDPT: సిద్దిపేట పట్టణంలోని రైతుబజార్ శుక్రవారం పూర్తిగా బంద్ ఉంటుందని ఏఎంసీ అధికారి నాగరాజు తెలిపారు. మార్కెట్ ప్రాంగణంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించాలని, తిరిగి శనివారం నుంచి యధావిధిగా క్రయవిక్రయాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.