SRD: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.