KDP: ప్రొద్దుటూరులో రిపోర్టర్ల వేధింపులు తట్టుకోలేక బియ్యం వ్యాపారి నజీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిద్రమాత్రలు మింగిన ఆయనను ప్రాణాపాయ స్థితిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యూట్యూబ్, టీవీ ఛానెల్ రిపోర్టర్లు, ఓ హోంగార్డు డబ్బుల కోసం వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం.