MDK: గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కడారి నర్సమ్మ కోరారు. గురువారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు.