MBNR: దేవరకద్ర మండలం పాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి మెగా వైద్య శిబిరాలు గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన యువతీ, యువకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.