నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ న౦దన్ గురువారం నగరంలోని 45, 46 డివిజన్లలోని పొగతోట, గాంధీనగర్, సాయిబాబా గుడి ప్రాంతాలలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. టౌన్ ప్లానింగ్ విభాగం నిర్దేశించిన మార్కింగ్ మేరకు పనులు చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన అధికారులకు సూచించారు.