VKB: శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్కో కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, దొంగతనాల నివారణకు ఇవి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.