MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పూలబొకే అందజేసి తన నియామకానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం సైతం వేం నరేందర్కు అభినందనలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సీఎం ఆయనకు సూచించారు.