SKLM: రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2.34 లక్షల హెక్టార్లలో ఆక్వాకల్చర్ సాగు జరుగుతోందని, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. ఆక్వాకల్చర్ రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.