ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం డీజీపేట తుంగోడు ఘాట్ రోడ్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. కనిగిరి ఎఫ్ ఆర్ ఓ తుమ్మా ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని తుంగూడు, వెంకటాయ చెరువు ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని రాత్రి సమయంలో ప్రయాణం చేయవద్దని, పశుకాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.