ATP: జనగణన ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటిసారి స్వయ గణన నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక అవగాహన, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.