ASR: రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 65 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి సుష్మ తెలిపారు. వీరిలో 37మంది హైరిస్క్తో ఉన్నట్లు గుర్తించామని వీరికి ప్రత్యేక వైద్య సహాయం, మందులు అందజేస్తున్నామన్నారు. గర్భిణులు బాలింతలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే, పెరట్లో లభించే ఆకు కూరలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.