KRNL: ఆదోనిలో పలు వార్డుల నుంచి ముస్లిం సోదరులు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఇంటి వద్దకు చేరుకుని ఇవాళ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పరస్పర ప్రేమ, ఐక్యతను ప్రతిబింబించేలా ఆత్మీయంగా కలుసుకున్నారు. సౌభ్రాతృత్వ వాతావరణంలో జరిగిన ఈ సమావేశం సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందని అధ్యక్షురాలు పేర్కొన్నారు.