NDL: కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడం కార్యకర్తల బాధ్యత అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేల్పనూరులో అధికారులు, పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ 100 శాతం విజయం సాధించేలా కృషి చేయాలని ఆయన కోరారు.