E.G: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని గోపాలపురం టీడీపీ రైతు విభాగ అధ్యక్షుడు అబ్బిన సురేంద్ర తెలిపారు. గత వైసీపీ పాలనలో ధాన్యం సొమ్ము చెల్లింపుల్లో ఆలస్యం జరిగేదని, ప్రస్తుతం ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతోందని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని, రైతులకు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు.