PPM: ఆశ్రమ పాఠశాలల్లో విద్య ప్రమాణాలను మెరుగుపరచాలని, విధి నిర్వహణలో ఏమాత్రం ఆలసత్వం వహించనా సహించేది లేదని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. గురువారం కురుపాం మండలం పాడి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థుల విద్య ప్రమాణాలను ఆశించిన స్థాయిలో లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.