E.G: నిడదవోలు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతి పూలే అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.