NLR: వలేటివారిపాలెం మండలం మాలకొండ శ్రీమాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఉదయం 10 గంటలకు ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లు EO చంద్రశేఖర్ తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ ఛైర్మన్ దాసరి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ధర్మ పరిరక్షణ, ప్రచారం, అభివృద్ధిపై ఆచార్యులు, అర్చక సంఘాలు సూచనలు ఇవ్వనున్నారు. అర్చకుల సమస్యలు కూడా చర్చించనున్నారు.