డోన్ పట్టణంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాన్ని ఇవాళ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా ఆమెకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం మన్నె గౌతమ్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.