KDP: ఆ ఇంట్లో వారిద్దరూ కవల పిల్లలు. పులివెందుల పట్టణానికి చెందిన గురు దత్త-అనిలా దేవి దంపతుల కుమార్తెలు సాయి వర్ణిత, సాయి వర్షితలు. వీరిద్దరూ కష్టపడి చదివి న్యాయ పట్టా పొందారు. సాయి వర్ణిత ఏపీఎండీసీ న్యాయ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ దక్కించుకోగా.. సాయి వర్షిత 5 కేంద్ర ప్రభుత్వ కొలువులు సాధించింది.